ఓల్డ్ బోయిన్ పల్లి డివిజన్ లోని చత్రిగడ్డలో స్వయంభు శ్రీ సాంబశివ దేవాలయం పునర్నిర్మాణం కార్యక్రమాన్ని రెండవ రోజు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, బిజెపి రాష్ట్ర నాయకురాలు బోడిగే శోభ, బిజేపి మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా అధ్యక్షులు పన్నాల హరీష్ రెడ్డి, కూకట్ పల్లి నియోజకవర్గం ఇన్చార్జి మాధవరం కాంతారావు హాజరై ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేశారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ. నూతన దేవాలయ పునర్నిర్మాణం కార్యక్రమాన్ని స్థానిక బిజెపి నాయకుడు ఏనుగుల తిరుపతి ఆహ్వానం మేరకు శ్రీ సాంబశివ దేవాలయం రెండో రోజు ఉత్సవాలకు హాజరు కావడం జరిగిందని వారు తెలిపారు. రెండవ రోజు ప్రత్యేకమైన హోమాలు, అభిషేకాలు, యజ్ఞాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. దేవాలయాల అభివృద్ధికి బిజెపి ఎప్పుడు సహకరిస్తుందని, రాబోయే రోజుల్లో ఓల్డ్ బోయిన్పల్లిలో అతిపెద్ద టెంపుల్ గా మా సహాయ సహకారాలు అందిస్తామని ముఖ్య అతిధులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా ఉపాధ్యక్షులు జగదీష్, బిజెపి నాయకులు మోహన్, స్వామి, రాకేష్, మధు, బబ్లు, కార్తీక్, అజయ్, బల్బీర్, రమేష్, తదితరులు పాల్గొన్నారు.