బైక్ దొంగల ముఠా అరెస్ట్

65చూసినవారు
జల్సాలకు అలవాటు పడి పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలను దొంగిలించి ముక్కలు ముక్కలుగా చేసి అమ్ముతున్న ఇద్దరు దొంగలు, స్క్రాప్ వ్యాపారులను ముషీరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసినారు. వారి వద్ద మూడు ద్విచక్ర వాహనాలు, రూ. 85000 నగదును స్వాధీనం చేసుకున్నారు. దొంగతనాలకు పాల్పడి తప్పించుకు తిరుగుతున్న ఇద్దరు దొంగలు, స్క్రాప్ వస్తువులు కొనుగోలు చేస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు వారు తెలిపారు.

సంబంధిత పోస్ట్