తెలంగాణలో రైతులు ఖరీఫ్ పనులు మొదలు పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా రైతు బంధుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని. ఈ విషయంపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు ఆదివారం డిమాండ్ చేశారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం వర్షం పడగానే రైతుబంధు ఇచ్చేదని. కానీ రేవంత్ ప్రభుత్వం మీనామేషాలు లెక్కిస్తోందని ధ్వజమెత్తారు.