మోదీ కులంపై రేవంత్ వ్యాఖ్యలు.. ప్రజల దృష్టి మరల్చేందుకే: ఎంపీ అర్వింద్

83చూసినవారు
మోదీ కులంపై రేవంత్ వ్యాఖ్యలు.. ప్రజల దృష్టి మరల్చేందుకే: ఎంపీ అర్వింద్
తెలంగాణలో కులగణన అంశంలో దొర్లిన తప్పుల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే రేవంత్ రెడ్డి కావాలని ప్రధాని మోదీ కులంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. ''నరేంద్ర మోదీ కులంపై గతంలోనే ఒక స్పష్టత ఉంది. మోదీ గుజరాత్ సీఎం కాకముందే ఆయన కులాన్ని ఓబీసీ జాబితాలో చేర్చారు. ఇప్పుడు కావాలని రేవంత్ రెడ్డి వివాదాన్ని రాజేశారు" అని అర్వింద్ పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్