ఐపీఎల్ 2025లో భాగంగా రాజస్థాన్ రాయల్స్తో జరుగుతున్న మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ హాఫ్ సెంచరీ సాధించారు. 37 బంతుల్లో రుతురాజ్ గైక్వాడ్ 50 పరుగులు పూర్తి చేసుకున్నారు. ఐపీఎల్లో రుతురాజ్ గైక్వాడ్కు ఇది 20వ అర్థశతకం. ఒకపక్క వికెట్లు పడుతున్నా.. మరోపక్క చేతికి దెబ్బ తగిలినా కూడా గైక్వాడ్ జట్టు కోసం నిలకడగా ఆడుతున్నారు. దీంతో 14 ఓవర్లకు CSK స్కోరు 111/4గా ఉంది.