రూ. 27 అధికంగా వసూలు.. రూ. 27 లక్షలు ఫైన్ వేసిన వినియోగదారుల కమిషన్

81చూసినవారు
రూ. 27 అధికంగా వసూలు.. రూ. 27 లక్షలు ఫైన్ వేసిన వినియోగదారుల కమిషన్
హైదరాబాద్‌లోని ఓ హోటల్‌కు వినియోగదారుల కమిషన్ దిమ్మ దిరిగే తీర్పు ఇచ్చింది. కాకినాడకు చెందిన కల్యాణ్ 2023లో బోడుప్పల్‌లోని ఓ హోటల్‌కు వెళ్లి భోజనం చేశాడు. బిల్లు మొత్తం రూ.3వేలు కాగా అందులో మూడు వాటర్ బాటిళ్లకు రూ.27 అధికంగా వసూలు చేసింది. దీంతో అతను వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించాడు. విచారణ జరిపిన కమిషన్ బాధితుడికి పరిహారం కింద రూ.27 వేలు చెల్లించి అలాగే సీఎం సహాయనిధికి రూ.27లక్షలు చెల్లించాలని తీర్పు ఇచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్