మార్చి 12తో పీఎం ఇంటర్న్షిప్ స్కీమ్ దరఖాస్తు గడువు ముగియనుంది. టెన్త్, ఇంటర్, డిప్లొమా, ఐటీఐ, డిగ్రీ చదివిన 21-24 ఏళ్ల వయసు కలిగిన నిరుద్యోగులు అర్హులు. కుటుంబ ఆదాయం ఏడాదికి రూ.8 లక్షలలోపు ఉండాలి. దీని ద్వారా దేశంలోని టాప్-500 కంపెనీల్లో ఏడాది పాటు ఇంటర్న్షిప్ అవకాశం కల్పిస్తారు. నెలకు రూ.5000 స్టైఫండ్, వన్ టైం గ్రాంట్ కింద రూ.6 వేలు ఇస్తారు. దరఖాస్తుకు వెబ్సైట్: https://pminternship.mca.gov.in/login/