ముగిసిన పదవ తరగతి పరీక్షలు

1078చూసినవారు
సంగారెడ్డి జిల్లాలో 10వ తరగతి పరీక్షలు శనివారంతో ముగిసాయి. జిల్లా వ్యాప్తంగా చివరి రోజు 21, 223 మంది విద్యార్థులు పరీక్షలను రాశారు. జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు సంగారెడ్డిలోని పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. జిల్లా వ్యాప్తంగా పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు డీఈవో తెలిపారు. ఏప్రిల్ 1వ తేదీన 18 సెంటర్లలో ఒకేషనల్ పరీక్షలు జరుగుతాయని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్