జిల్లాకు చేరుకుంటున్న పుస్తకాలు
2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన పుస్తకాలు సంగారెడ్డికి చేరుకున్నాయి. జిల్లాలోని ఒకటి నుంచి 10వ తరగతి విద్యార్థులకు 10. 51 లక్షల పుస్తకాలు అవసరం కాక ఇప్పటివరకు 1. 51 లక్షల పుస్తకాలు జిల్లా విద్యాధికారి కార్యాలయానికి చేరుకున్నాయి. ఈనెల చివరివారం వరకు పుస్తకాలు పూర్తిస్థాయిలో వస్తాయని వెంకటేశ్వర్లు తెలిపారు. జూన్ మొదటి వారంలో పాఠశాలలకు పంపిస్తామని చెప్పారు.