సంగారెడ్డి జిల్లా, సిర్గాపూర్ మండల పరిధిలోని అంతర్గామ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో శనివారం 4వ తరగతి విద్యార్ధి బాలకృష్ణ, 7వ తరగతి విద్యార్ధి మహేష్ భారత రాజ్యాంగ నిర్మాత డా"బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని అంబేద్కర్ చిత్రపటాన్ని చక్కగా గీశారు. విద్యార్థులను ప్రధానోపాధ్యాయులు భరత్, ఉపాధ్యాయులు శివకుమార్, స్వామి అభినందించారు. అనంతరం విద్యార్థులకు అంబేద్కర్ జీవిత చరిత్ర వివరించారు.