నారాయణఖేడ్ నియోజకవర్గం నాగలిగిద్ద మండలం ఎనాక్ పల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ విఠలేశ్వర రుక్మిణి వారి ఆలయంలో స్వామి వారిని ఆదివారం మాజీ శాసనసభ్యులు మహా రెడ్డి భూపాల్ రెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు. వారితో పాటు మండల పార్టీ అధ్యక్షులు పండరి, మాజీ జడ్పీటీసీ లక్ష్మీబాయి, రవీందర్ నాయక్, మండల పార్టీ యువత అధ్యక్షులు కృష్ణ ప్రసాద్, తదితరులు ఉన్నారు.