బొల్లారం మున్సిపల్ పరిధిలోని సాయిబాబా ఆలయం వెనకాల మీది కుంట లో చేపడుతున్న అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని రెండో వార్డ్ కౌన్సిలర్ గోపాలమ్మ డిమాండ్ చేశారు. సోమవారం అక్రమ నిర్మాణాలను ఆమె పరిశీలించారు. కూల్చివేతలు జరిపిన మళ్లీ నిర్మాణాలు చేపడుతున్నారన్నారు. బాధ్యులైన అధికారులు అక్రమార్కులపై కేసులు నమోదు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.