కోతుల బెడదను నివారించాలి

72చూసినవారు
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలో కోతుల బెడద భరించలేకపోతున్నామని మండల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శనివారం మండల కేంద్రంలోని పలు కాలనీల్లో కోతుల గుంపు స్థానికులను భయాందోళనకు గురిచేసింది. ఇల్లల్లోకి జొరబడి ఏది దొరికితే అది ఎత్తుకెళ్తున్నాయని, పెద్దలు పిల్లలు వృద్ధుల మీద పడి కరుస్తున్నాయని వాపోతున్నారు. కోతులు పట్టే వారిని పిలిపించి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్