రేపు ఇస్నాపూర్ గురుకులంలో స్పాట్ అడ్మిషన్లు

60చూసినవారు
2024-25 సంవత్సరానికి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల్లో 5 నుంచి 9వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్లకు ఈనెల 12వ తేదీన స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు జోనల్ అధికారి నిర్మల బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు చెందిన ఎస్సి విద్యార్థులు పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ గురుకులంలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు హాజరుకావాలని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్