జిల్లాలో ఎగ్జిట్ పోల్స్ నిషేధం

2575చూసినవారు
జిల్లాలో ఎగ్జిట్ పోల్స్ నిషేధం
జిల్లాలో జూన్ 1వ తేదీ వరకు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ నిషేధించినట్లు జిల్లా ఎన్నికల అధికారి వల్లూరు క్రాంతి శనివారం తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఎగ్జిట్ పోల్స్ నిర్వహించిన, పత్రికల్లో ప్రచురించిన, టీవీలు, సోషల్ మీడియాలో ప్రసారం చేసిన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. వారిపై ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951, సెక్షన్ 126 (ఏ) ప్రకారం శిక్షార్హులు అవుతారని తెలిపారు.

సంబంధిత పోస్ట్