వాసవి దేవాలయంలో కృత్తికా నక్షత్ర వేడుకలు

65చూసినవారు
సంగారెడ్డిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో కృత్తికా నక్షత్ర వేడుకలు గురువారం నిర్వహించారు. మహిళలు సామూహిక కుంకుమార్చనతో పాటు లలిత సహస్ర పారాయణం చదివారు. అమ్మవారి పల్లకి సేవను భక్తిశ్రద్ధలతో జరిపించారు. కార్యక్రమంలో దేవాలయ కమిటీ చైర్మన్ తోపాజి అనంతకృష్ణ, కోశాధికారి జూలకంటి మల్లేశం, కార్యనిర్వాహక కార్యదర్శి కొంపల్లి విద్యాసాగర్, సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్