సంగారెడ్డి జిల్లా, నియోజకవర్గం కోర్టు బార్ అసోషియేషన్ అధక్షులుగా ఏ. విష్ణువర్దన్ రెడ్డి 8వ సారి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. తనను 8వ సారి బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు అసోసియేషన్ సభ్యులకు దన్యవాదములు తెలిపారు. న్యాయవాదుల సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు కృషి చేస్తానని గురువారం ఆయన అన్నారు. విష్ణువర్ధన్ రెడ్డిని న్యాయవాదులు శాలువాలతో సన్మానించి ఘనంగా సత్కరించారు.