హర్యానాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇవాళ రంజాన్ సెలవు ఉన్నప్పటికీ స్థానికంగా ఉన్న GL పబ్లిక్ స్కూల్ను అధికారులు తెరిచారు. దీంతో పాఠశాలకు చెందిన బస్సు విద్యార్థులను ఎక్కించుకుని వస్తోంది. ఈ క్రమంలో నార్నౌల్ సమీపంలోని ఉన్హాని గ్రామ సమీపంలో బోల్తాపడింది. అనంతరం పల్టీలు కొట్టడంతో బస్సులోని ఐదుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. 10 మందికిపైగా గాయపడినట్లు సమాచారం.