మద్యం తాగి న్యూసెన్స్ చేస్తున్నాడని చితకబాదిన పోలీసులకు షాక్(వీడియో)

56చూసినవారు
TG: మద్యం తాగి న్యూసెన్స్ చేస్తున్నాడని నడిరోడ్డుపై వ్యక్తిని చితకబాదిన పోలీసులకు ఎదురుదెబ్బ తగిలింది. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పీఎస్ పరిధిలో మద్యం తాగి న్యూసెన్స్ చేస్తున్నాడని కానిస్టేబుల్ కిరణ్, హోంగార్డు గంగాధర్ నడిరోడ్డుపై వ్యక్తిని చితకబాదారు. విచక్షణా రహితంగా కొట్టడంతో బాధితుడు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీంతో కానిస్టేబుల్ కిరణ్, హోంగార్డు గంగాధర్‌ను SP రాజేష్ చంద్ర సస్పెండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్