వేటగాళ్ల ఉచ్చుకు బలైన చిరుత

10301చూసినవారు
వేటగాళ్ల ఉచ్చుకు బలైన చిరుత
అటవీ జంతువుల కోసం వేటగాళ్లు పన్నిన ఉచ్చులో పడి చిరుత మృతి చెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. తొగుట సిఐ లతీఫ్ వివరాలు. దౌల్తాబాద్ చేగుంట సరిహద్దు ప్రాంతంలో అడవిలో వేటకు వెళ్లిన పలువురు అడవి జంతువుల కోసం ఉచ్చు ఏర్పాటు చేశారు. వారు ఏర్పాటు చేసిన ఉచ్చులో పడి చిరుత మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్