స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా ప్రభుత్వం కాలయాపన చేయడం సరైన కాదని మాజీ వైస్ ఎంపీపీ పోలీసు రాజులు అన్నారు. మిరుదొడ్డి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో అభివృద్ధి కొంటుపడి ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్ర ప్రభుత్వం సైతం నిధులు కేటాయించకపోవడం జరుగుతుందన్నారు.