జమ్మికుంట పత్తి మార్కెట్లో సీసీఐ కొనుగోళ్లు ప్రారంభం

52చూసినవారు
జమ్మికుంట పత్తి మార్కెట్లో సీసీఐ కొనుగోళ్లు ప్రారంభం
ఉత్తర తెలంగాణలోనే రెండవ అతి పెద్ద మార్కెట్ అయిన కరీంనగర్ జిల్లా జమ్మికుంట పత్తి మార్కెట్లో ప్రభుత్వ రంగ సంస్థ సీసీఐ పత్తి కొనుగోళ్లను బుధవారం ప్రారంభించింది. జమ్మికుంటలో సిసీఐ అధికారి చంద్రశేఖర్, ఇతర మార్కెటింగ్ అధికారులతో కలిసి పత్తి కొనుగోళ్లను ప్రారంభించారు. అధికారులు మాట్లాడుతూ. పత్తిలో తేమ శాతం 8 నుంచి 12 శాతం వరకు వచ్చేలా మార్కెట్కు తరలిస్తే రైతులకు మద్దతు ధర వస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్