కమలాపూర్ మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సీఐ

55చూసినవారు
గత రెండు రోజులుగా మండలంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో.. కమలాపూర్ మండల ప్రజలకు సీఐ హరిక్రిష్ణ పలు సూచనలు చేశారు. వర్షాలతో మండల వ్యాప్తంగా ఉన్న చెరువులు నిండి మత్తడి పడే అవకాశాలు ఉన్నాయని, అత్యవసరం అయితే తప్ప బయటకు ఎవరు రావద్దన్నారు. వర్షాలు పడుతున్న సమయంలో రైతులు కరెంటు మోటార్ల వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్