కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పర్యటనలో స్వల్ప మార్పులు జరిగాయి. ఈనెల 5న నిర్మల్, అలంపూర్ ఎర్రవల్లి చౌరస్తాలో బహిరంగ సభకు రాహుల్ గాంధీ హాజరు అవుతారు. ఈనెల 9న కరీంనగర్, సరూర్నగర్లో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. అయితే ఈనెల 6,7 తేదీల్లో రాష్ట్రానికి రావాల్సిన ప్రియాంక గాంధీ పర్యటన వాయిదా పడింది. ఈనెల 10న ఎల్లారెడ్డి, తాండూర్, షాద్నగర్లో ప్రియాంక ప్రచారం చేయనుంది.