జూన్ 1న విడుదలైన ఎగ్జిట్ పోల్స్ అన్ని బీజేపీకి, ఎన్డీఏ కూటమికి అనుకూలంగా వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ స్పందించారు. ‘వెయిట్ చేసి చూడండి. ఎగ్జిట్ పోల్స్లో చెప్పిన దానికి వ్యతిరేకంగా ఫలితాలు ఉంటాయని మేం నమ్ముతున్నాం. అదే జరుగుతుంది కూడా’ అని చెప్పుకొచ్చారు. కాగా, రేపు లోక్సభ ఎన్నికల ఫలితాలు రానున్న సంగతి తెలిసిందే.