నమీబియా సీనియర్ క్రికెటర్ డేవిడ్ వీస్ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించారు. టీ20 వరల్డ్ కప్లో ఇంగ్లాండ్తో నమీబియా ఓటమి తర్వాత ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. తనకిప్పుడు 39 ఏళ్లని, తన కెరీర్కు వీడ్కోలు పలకడానికి ఇదే సరైన సమయమని పేర్కొన్నాడు. ఆయన గతంలో దక్షిణాఫ్రికా తరుపున 2013 టీ20 ప్రపంచకప్, 2015 వన్డే ప్రపంచకప్లో ఆడాడు. 2021 నుంచి నమీబియా క్రికెట్ జట్టుకు ప్రాతినిథ్యం వహించారు.