దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1196.98 పాయింట్ల లాభంతో 75,418.04 వద్ద ముగిసింది. నిఫ్టీ 369.85 పాయింట్ల లాభంతో 22,967.65 వద్ద స్థిరపడింది. సన్ఫార్మా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఎన్టీపీసీ షేర్లు మినహా అన్ని షేర్లూ లాభపడ్డాయి. కాగా ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్ అంచనాలను మించి ఆర్బీఐ తాజాగా కేంద్రానికి డివిడెండ్ ప్రకటించడం సూచీల పరుగుకు కారణమైంది.