లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులతో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తాజాగా గుంటూరు జిల్లా తాడేపల్లిలో చోటుచేసుకుంది. విజయవాడకు చెందిన మురికింటి వంశీ(22) కృష్ణా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. వంశీ రూ.10 వేలు రుణం తీసుకుంటే రూ. లక్ష కట్టాలంటూ నిర్వాహకులు వేధింపులకు దిగారు. ఈ క్రమంలో ఈ నెల 25న ఇంటి నుంచి వెళ్లిన వంశీ చనిపోతున్నానంటూ మెసేజ్ పంపిన అనంతరం ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.