ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ 28 ఏళ్ల యువకుడు ఉన్నట్టుండి అకస్మాత్తుగా కుప్పకూలి చనిపోయాడు. గుండెపోటుతోనే మరణించినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. మృతుడిని రాష్ట్రీయ లోక్దళ్ కార్యకర్త అమిత్ చౌదరిగా గుర్తించారు. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. సోషల్ మీడియాలో వైరల్గా మారింది.