సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపింది. ఐపీఎల్ 2025లో భాగంగా విశాఖ వేదికగా హైదరాబాద్ జట్టు నేడు ఢిల్లీతో తలపడనుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు అంతా కలిసి ఉగాది శుభాకాంక్షలు చెబుతూ ఓ ప్రత్యేక వీడియో రుపొందించారు. ఈ వీడియోను సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.