తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ

81చూసినవారు
తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ
తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ జరిగిన ఘటన నేరేడుచర్లలో చోటుచేసుకుంది. ఎస్సై రవీందర్ నాయక్ తెలిపిన వివరాలు ప్రకారం. పట్టణానికి చెందిన అప్పయ్య ఈ నెల 12వ తేదీన కుటుంబీకులతో ఊరు వెళ్లారు. ఆదివారం ఇంటికి వచ్చేసరికి బీరువా తెరిచి ఉంది. అందులో దాచిన ఐదు తులాల బంగారం అభరణాలు, ఎల్ఈడి టీవీ హోమ్ థియేటర్ చోరీ అయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్