పోలీసుల కార్డెన్ సెర్చ్

70చూసినవారు
పోలీసుల కార్డెన్ సెర్చ్
మట్టంపల్లి మండలంలో సోమవారం సీఐ చరమంద రాజు ఎస్సై వీరాంజనేయులు ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. సరైన ధ్రువ పత్రాలు లేని ద్విచక్ర వాహనాలు ట్రాక్టర్లు ఆటో పది లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నారు. వారు మాట్లాడుతూ.. ప్రజలు చట్టానికి లోబడి తమదైన వ్యవహారాలు చేసుకోవాలన్నారు. ఐదుగురు ఎస్సైలు, 30 మంది కానిస్టేబుళ్ళు, 10 మంది హోమ్ గార్డ్స్, 10 మంది కేంద్ర బలగాలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్