మోడీ మళ్ళీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తారు: కాంగ్రెస్ ఎంపీ

80చూసినవారు
మోడీ మళ్ళీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తారు: కాంగ్రెస్ ఎంపీ
ప్రధాని నరేంద్ర మోడీపై భువనగిరి నియోజకవర్గం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రధాని
గుజరాత్ రాష్ట్రం గురించి ఆలోచిస్తున్నారు తప్పా.. వేరే రాష్ట్రాల గురించి ఆలోచించట్లేదన్నారు. ప్రధాని అని మరచి గుజరాత్ రాష్ట్రానికి సీఎం లా వ్యవహరిస్తున్నారు. మోడీ మళ్లీ అధికారంలోకి వస్తే భారత రాజ్యాంగాన్ని ఖూనీ చేసే ప్రయత్నం చేస్తాడని మండిపడ్డారు. ప్రజలందరూ ఈ విషయాన్ని గుర్తించాలన్నారు. మే 13న జరిగే ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలని, కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్