శాంతినగర్ ఎస్సీకాలనీలో నీటి కటకట

85చూసినవారు
శాంతినగర్ ఎస్సీకాలనీలో నీటి కటకట
అనంతగిరి మండలం శాంతినగర్ గ్రామంలోని ఎస్సీకాలనీలో గత రెండు నెలల నుంచి నీటి కొరత ఏర్పడి నానా ఇబ్బందులు పడుతున్నామని కాలనీ మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ. 2నెలల నుంచి నీళ్ల కోసం కిలో మీటర్ దూరం వెళ్లి, బిందెలతో తెచ్చుకుంటున్నామని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నీటి సమస్య లేకుండా చూడాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్