TDP, JDU పార్టీలు స్పీకర్ పదవిని తీసుకోకపోతే ఆ పార్టీలు ఛిన్నాభిన్నం అవుతాయని శివసేన నాయకుడు ఆదిత్య ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్, బిహార్లకు ప్రత్యేక హోదా, ప్యాకేజీ కావాలనుకుంటే ఇప్పుడే సరైన సమయం అని తరువాత అవకాశం ఉండదని స్పష్టం చేశారు. ఈ సంకీర్ణ ప్రభుత్వం ఎక్కువ రోజులు మనుగడ సాగించదని అంచనా వేశారు.