అండర్-19 మహిళల ప్రపంచ కప్లో టీమిండియా విజయాల పరంపర కొనసాగుతోంది. నేడు స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా 150 పరుగుల తేడాతో భారీ విజయం నమోదు చేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా ఒక వికెట్ కోల్పోయి 208 పరుగులు చేసింది. 209 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ దిగిన స్కాట్లాండ్ 58 పరుగులకే ఆలౌట్ అయింది. అయూసీ శుక్లా, వైష్ణవి, త్రిష పోటీపడి వికెట్లు తీయడంతో టీమిండియా ఘన విజయం సాధించింది.