ఎండల తీవ్రత.. వడదెబ్బకు 19 మంది మృతి

19729చూసినవారు
ఎండల తీవ్రత.. వడదెబ్బకు 19 మంది మృతి
తెలంగాణలో వారం రోజులుగా మండుతున్న ఎండలకు రైతులు, దినసరి కూలీలు, వృద్ధులు మృత్యువాత పడుతున్నారు. శనివారం పలు జిల్లాల్లో ఏకంగా 19 మంది మృతి చెందారు. జగిత్యాల జిల్లా రాయికల్‌ మండలం అల్లిపూర్‌, ధర్మపురి మండలం జైన, కరీంనగర్‌ జిల్లా వీణవంకలో 46.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. 22 జిల్లాల్లోని 95 మండలాల్లో వడగాలులు వీచాయి. నేటినుంచి ఉష్ణోగ్రతలు కొంత తగ్గుముఖం పట్టే సూచనలు ఉన్నాయి.

సంబంధిత పోస్ట్