వర్షాకాలం ప్రారంభం కావటంతో బెంగళూరులోని పలు కాలనీల్లో పాముల బెడద ఎక్కువైంది. దీంతో ప్రజలు నుంచి బీబీఎంపీకి రోజురోజుకూ ఫోన్ కాల్స్ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అందిన సమాచారం మేరకు బీబీఎంపీ అటవీ శాఖ సిబ్బంది ఓ కాలనీలోని ఇంట్లో 9 పాము పిల్లలను పట్టుకున్నారు. వాటిని రక్షించి బానసవాడి విజయ బ్యాంక్ కాలనీలో సేఫ్ జోన్కు తరలించారు.