పులి.. వేట విషయంలో మిగతా జంతువుల కంటే ముందు ఉంటుంది. పులికి చిక్కితే ప్రాణాల మీద ఆశ వదిలేసుకోవాల్సిందే. తాజాగా రాజస్థాన్లోని రణథంబోర్ నేషనల్ పార్క్కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆ పార్క్లోని రిజర్వాయర్లో ఓ జింకను పులి పట్టుకుంది. జింకపై పంజాతో దాడి చేసి దానిని నీటిలో ముంచింది. జింక తప్పించుకోవడానికి ప్రయత్నించినా పులి ఒక్క దెబ్బకే చంపింది. ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది.