తాజాగా టాలీవుడ్ నటుడు నిఖిల్ చేసిన పనికి సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తుంది. ఆంధ్రప్రదేశ్లోని చీరాలలో కొన్ని సంవత్సరాలుగా మూసివేయబడిన ఓ ఆలయాన్ని నిఖిల్ తెరిపించాడు. అంతేకాదు దాని నిర్వహణ బాధ్యతలు కూడా తీసుకున్నాడు. ఈ విషయాన్ని నిఖిల్ ఇన్స్టా వేదికగా వెల్లడించాడు. ఆలయాన్ని తిరిగి తెరిపించేందుకు వచ్చిన నిఖిల్ను పూలపై నడిపించి ఆహ్వానించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.