హనుమకొండ నగరం కాజీపేట సోమడిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఛత్తీస్గఢ్ కు చెందిన లోక్నాథ్ ఖర్ష్ కుటుంబం వలస వచ్చి తాపీమేస్త్రీగా పనిచేస్తున్నారు. బుధవారం లోక్నాథ్ భార్య భారతి సోమిడిలో నిర్మాణంలో ఉన్న ఇంటి దర్వాజకు, ఇటువైపు ఇనుప స్టూలుకు చీరతో ఊయల కట్టి చిన్నారి రోషిత (6 నెలలు)ను అందులో పడుకోబెట్టింది. అయితే స్టూల్ సరిగా లేకపోవడంతో ఊయలలో ఉన్న చిన్నారిపై పడింది. దీంతో పాప నుదుటికి బలమైన గాయం కాగా చికిత్స పొందుతూ మృతి చెందింది.