అల్లూరి జిల్లాలో మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలపై విసుగు చెంది, ఇద్దరు మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యులు జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ ఎదుట స్వచ్ఛందంగా లొంగిపోయారు. సరెండర్ అయిన వారిలో రవ్వ కొస అలియాస్ జగదీష్, పోడియం రమేష్ ఉన్నారు. మావోయిస్టు ఉద్యమాన్ని వీడి, జనజీవన స్రవంతిలో కలిసేందుకు వారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.