AP: కర్నూలు జిల్లా కోడుమూరు ఎస్సీ హాస్టల్లో తమ మాట వినలేదని టెన్త్ విద్యార్థి 6వ తరగతి విద్యార్థులను విచక్షణారహితంగా బెల్ట్తో కొట్టిన విషయం తెలిసిందే. కాగా ఈ ఘటనపై అధికారులు సీరియస్ అయ్యారు. హాస్టల్ లో విద్యార్థుల సంరక్షణ పట్ల నిర్లక్ష్యం వహించినందుకు హాస్టల్ వార్డెన్ ను కలెక్టర్ సస్పెండ్ చేశారు. ఈ ఘటన జరిగి 12 రోజులు గడిచినా ఎలాంటి విచారణ చేపట్టకుండా వార్డెన్ నిర్లక్ష్యంగా వహించారని కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.