2024లో గుంటూరు నుంచి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన పెమ్మసాని చంద్రశేఖర్ భారీ మెజారిటీతో గెలిచారు. నేడు మోదీ క్యాబినెట్లో కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. గతంలో గుంటూరు జిల్లా బుర్రిపాలెం నుంచి సాధారణ వైద్యుడిగా అమెరికా వెళ్లిన ఆయన అనతికాలంలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. అమెరికాలోని డాలస్లో పెమ్మసాని ఫౌండేషన్ ద్వారా ఉచిత వైద్య సేవలు అందించారు.