బంగ్లాదేశ్లోని ఖుల్నా జిల్లాలో తాజాగా దారుణ ఘటన జరిగింది. అక్కడ ఓ మహిళపై అత్యాచారం చేసి, హత్య చేసి, మొక్కజొన్న తోటలో పడేశారు. మహిళ తల నరికి కేవలం మొండెం మాత్రమే ఉంచారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మహిళ తల లేకపోవడంతో పోలీసులు ఆమెను గుర్తించలేకపోయారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.