ఉపాధి కూలీలకు త్రాగునీరు చలువ పందిర్లు ఏర్పాటు

68చూసినవారు
బొంరస్ పేట మండలం ఏర్పుమల్ల పంచాయతీ కార్యదర్శి మహేశ్వరి జిల్లా కలెక్టర్ ఆదేశాలతో వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని చల్లటి మట్టి కుండలో త్రాగునీరు, షెడ్ నెట్ తో గురువారం ఉపాధి కూలీలకు నీడ ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరు ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకొని ప్రభుత్వం అందించే కూలీని పొందాలని ఆమె కోరారు. కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ నర్సింలు, ఉపాధిహామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్