పరిశుభ్రత పట్ల శ్రద్ధ అవసరం: ఎంపీడీఓ కరీం

62చూసినవారు
పరిశుభ్రత పట్ల శ్రద్ధ అవసరం: ఎంపీడీఓ కరీం
వికారాబాద్ జిల్లా పరిగి మండలం పరిధిలోని సొండేపూర్, రూఫ్ ఖాన్ పేట్, చిగురాల్ పల్లి గ్రామాల్లో పరిగి ఎంపీడీఓ కరీం స్వచ్ఛతాహి సేవా కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పర్యటించారు. గ్రామాల్లో తిరుగుతూ గ్రామస్థులకు పచ్చదనం పట్ల అవగాహన కల్పించారు. అనంతరం గ్రామాల్లో ఉన్న పిచ్చి మొక్కలను తొలగించి దోమల నివారణకు చేపట్టాల్సిన చర్యల గురించి అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్