వికారాబాద్ జిల్లా పూడూరు మండల పరిధిలోని చింతలపల్లి గ్రామంలో బిజెపి నాయకులు చేవెళ్ల పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి మద్దతుగా ఆదివారం ప్రచారం నిర్వహించారు. ప్రధానిని మరోసారి గెలిపించాలని బిజెపితోనే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ చేసిన అభివృద్ధిని వివరించారు. కార్యక్రమంలో వెంకట్ ముదిరాజ్, చంద్రశేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.