వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీ పరిధిలోని ఏడవ వార్డు గంగపుత్ర కాలనీలో సోమవారం బిఆర్ఎస్ నాయకులు ప్రచారం కొనసాగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. చేవెళ్ల పార్లమెంట్ బిఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలనికోరారు. బిఆర్ఎస్ చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు సురేందర్, తదితరులు పాల్గొన్నారు.