వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలో బి ఆర్ ఎస్ చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ తరపున ఆదివారం ఎన్నికల ప్రచారంలో పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. గత బి ఆర్ ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందిందన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి బిఆర్ఎస్ అభ్యర్థి జ్ఞానేశ్వర్ ను గెలిపించాలని కోరారు.